...

1 views

murugan
*ఈ గుడిలో ప్రార్థన చేస్తే చదువులో రాణిస్తారు!*
____________________
*పార్వతీపరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. ఆయనే దేవతలకు సేనాధిపతి. మురుగన్‌ పేరుతో సుబ్రమణ్యస్వామిని పిలుస్తారు.*

*సూరపద్ముడినే రాక్షసుని ఈయన సంహరించాడు. సూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి పలు రణ శిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి.*

*అవి… పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం. తిరుత్తణి, పళముదిరి కొలయ్‌.*

*సూరపద్ముడి సంహారం అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకుని, శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందుకే అన్ని మురుగన్‌ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది.*

*ఆ రోజున వేయి కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు.*

*ఇక్కడ స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది.*

*దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.*

*సుబ్రహ్మణ్యస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు.*

*ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. *

*అయితే ముఖ్యమైన పండుగ సమయాల్లోనే ఈ చందనాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.*

*ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. ఇవి నాలుగు వేదాల పరిరక్షణకే అని తెలుస్తోంది.*

*భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి.*

*ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం.*

*అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు స్వామివారిని కొలుస్తూ ఇక్కడే తనువు చాలించాడు.*

*కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు.*

*ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి నోరు పవిత్రమై ఆశుధారగా గానం చేశాడు.*

*అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి అందజేశాడట.*
© director.gopikiran