aswadha tree
*_ఒకే అశ్వథ్థ వృక్షం - వృక్షంలో 22 గణపతులు...!!_*
భగవద్గీత లో శ్రీకృష్ణుడు
వృక్షాలలో అశ్వథ్థ వృక్షాన్ని నేను అని అంటాడు.
🌿అశ్వథ్థవృక్ష
మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగాన
శ్రీమహావిష్ణువు,
వృక్షాగ్రాన మహేశ్వరుడు అనుగ్రహదర్శనమిస్తున్నారని పురాణాలు వివరిస్తున్నాయి.
అందువలననే అశ్వథ్థ వృక్షాన్ని
వృక్షరాజుగా పిలుస్తారు.
ఇంతటి మహిమాన్వితమైన
అశ్వధ్ధవృక్షంలో స్వయంభూగా కష్టాలను, సమస్యలను వ్రేళ్ళతో దునిమే గణపతిగా అవతరించాడు.
🌿ప్రధమంగా నర్తన గణపతి గా అవతరించి , పిదప
అదే వృక్షం లో 22 చోట్ల స్వయంభూగా దర్శనమిస్తున్నాడు.
🌸'ఓం' అనే ప్రణవమంత్రంలోని
అ, ఉ, మ కారాలలో ఉ కారంలో వున్నది శ్రీ మహా విష్ణువు.
🌿 మహావిష్ణువు స్తోత్రాలలో "శుక్లాంబరధరం ,విష్ణుం
శశి వర్ణం, చతుర్భుజం ,
ప్రసన్నవదనం ధ్యాయేత్ , సర్వ విఘ్నోప శాంతయే' అని లోకాలని కాపాడే శ్రీమన్నారాయణుడే విఘ్నాలను తొలగించే
వినాయకునిగా అవతరించినట్లుగా తెలియచేయబడినది.
🌸అందువలన, యీ అశ్వధ్ధవృక్షంలో
శ్రీ మహావిష్ణువు వున్న ప్రదేశంలో
వినాయకుడు అవతరించాడు.
🌿1983 వ సంవత్సరము జనవరి 26 తేదీన చెన్నై సాలిగ్రామంలో ఒక చిన్న కుటీరంలో యీ బాల వినాయకుని ఆలయం నిర్మించబడినది.
🌸వినాయకుని లీలలతోను
మహిమలతోను , క్రమ క్రమంగా యీ ఆలయం అభివృద్ధి చెందినది.
🌿దక్షిణ దేశంలోనే మొట్ట మొదటగా 1987 లో యీ బాల వినాయకునికి ఏక దిన లక్షార్చన పూజ అత్యంత కోలాహలంగా జరిగింది.
🌸ఆ సాయంకాలం ఘనంగా డోలోత్సవం కూడా జరిగింది. 19..10..2000 సంవత్సరములో
రాజ గోపురం కట్టి, ఆవరణ దేవతలను ప్రతిష్టించడం జరిగింది.
🌿2004 సంవత్సరంలో గణపతి
యొక్క వివిధ రూపాలను సీమ సున్నంతో తయారు చేయదల్చారు. కానీ , ఆ సంకల్పానికి అనేక
అడ్డంకులు వచ్చాయి.
🌸ఆ సమయంలోనే ఆలయానికి దక్షిణ పడమటి దిశగా వున్న అశ్వధ్ధవృక్షం మధ్య భాగం పగులు వచ్చి బీటలు పడి కిరీటంగా,ఏనుగు ముఖంగా, దంతంగా, తొండముగాను, కర్ణములుగాను, ఒక కాలు మడచి నర్తించే నర్తన గణపతి ప్రధమంగా స్వయంభూగా వెలిశాడు.
🌿వృక్షానికి వెనుక భాగమున
పంచముఖ హేరంబ గణపతి , ఉచ్ఛిష్ట గణపతి అని ఒక్కొక్క రూపంగా
స్వయంభూలుగా ఉధ్భవించసాగాయి.
🌸ఇప్పటివరకు 22 వినాయక మూర్తులు వెలిసాయి. వినాయకుడు
అనుగ్రహ ప్రసాదిగా
కీర్తించబడుతున్నాడు.
🌿ఈ వినాయకునికి ఆరు వారాలు వరుసగా ఆరు నిమ్మ పళ్ళు సమర్పించి
ప్రదక్షిణలు చేస్తే నెరవేరని కోరికేదీ వుండదని భక్తుల ధృఢ విశ్వాసం.
🌸మామిడి కాయ మొదట్లో చాలా పుల్లగా వున్న పక్వానికి వచ్చి పండగానే చాలా తీయగా వుంటుంది.
కాని నిమ్మకాయ మాత్రం ఎప్పుడూ తన పుల్లదనాన్ని కోల్పోదు.
🌿ఆవిధంగానే భగవంతునికి
భక్తుల యందు గల కరుణ , ప్రేమ ఎప్పటికీ మారదు అని నిమ్మకాయను సమర్పించడం ద్వారా స్వామి మనకు
తెలియజేస్తున్నాడు.
🌸ఆదివారాలలో
రాహుకాల సమయంలో ,
ఈ వినాయకునికి ప్రత్యేక అలంకారాలు చేసి, ఓంకార, గకార మూలమంత్ర త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా జరుగుతాయి.
🌿ప్రపంచంలో యీ వినాయకునికి పలు ప్రాంతాలలో భక్తులు వున్నారు. మూడంతస్తుల రాజగోపురం దాటగానే బాలవినాయకుని దర్శిస్తాము.
🌸ఆలయ ఆవరణలో దక్షిణా మూర్తి , లక్ష్మీ నారాయణమూర్తి , దుర్గాదేవి మొ. అనుగ్రహ దేవతల దర్శనం లభిస్తుంది.
🌿ప్రాకారము వద్ద
కాంచీ మహాస్వామి విగ్రహం సీమ సున్నంతో తయారు చేసినది వున్నది. ప్రతి గురువారం మహా మేరువుకి, చంద్రమౌళీశ్వరస్వామికి త్రిశతి అర్చనలు, అభిషేకాలు
జరుగుతాయి.
🌸దాని ప్రక్క మయూర వాహనుడు, చక్ర వ్యూహ మండపంలో వళ్ళీ , దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి,
అశ్వగణపతి , దుర్గాంబిక, మూషిక వాహన గణపతి
మొదలైన ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
🌿ఈ విగ్రహాల ప్రక్కన వున్న అద్దాల ద్వారా స్వామి శతాధిక మూర్తులుగా
వలయాకారంలో గోచరించి భక్తులను పరవశింపజేస్తారు.
🌸సంవత్సరానికి ఒక సారి
ప్రధమంగా ఆవిర్భవించిన నర్తన గణపతికి నవంబర్ 29 వ తేదీన ప్రత్యేక పూజలు జరుపుతారు.
🌿తరువాత హనుమంతుని సన్నిధి. ఇక్కడ హనుమజ్జయంతి,
శ్రీ రామనవమి సమయాలలో , యీ సన్నిధిలో ఒకే రోజు లో
ఒక లక్ష సార్లు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది.
🌸తరువాత అశ్వధ్ధ వృక్ష వినాయకుని క్రింద సర్ప విగ్రహాలు ప్రతిష్టించబడినవి. అశ్వథ్థ వృక్షానికి సమీపాన సప్తమాతృకల
చిత్రపటాలు దర్శన మిస్తాయి.
🌿ప్రతి శుక్రవారం
రాహుకాలంలో ఈ ఆలయంలో కన్యా దోష నివృత్తి పూజలు ప్రత్యేకంగా జరుపుతారు. ఆలయంలో నిత్యం చతుర్వేద పారాయణం జరుగుతుంది.
🌸 కంద షష్టి ఉత్సవం , ఉత్తరఫల్గుణి ఉత్సవ రోజుల్లో స్కందుని కి కళ్యాణం జరుపుతారు.
🌿దుర్గాదేవి కి నవరాత్రి పూజలు కోలాహలంగా చేస్తారు. జనవరి 18వ తేదీ నుండి 26 వ తేదీ వరకు వసంతోత్సవం వైభవంగా జరుపుతారు.
ఆ సమయంలో అన్ని హోమాలు చేస్తారు.
🌸జనవరి 26 వ తేదీన గణపతి రధాయాత్ర ఉత్సవం, ఏనుగు, అశ్వం, గరగలు, మయూర నాట్యాలు, ఒయిలాట్టాలతో వైభవంగా జరుపుతారు.
🌿ప్రతి పౌర్ణమినాడు మధ్యాహ్నము అన్నదానం జరుగుతుంది.
చెన్నై సాలిగ్రామం భరణి కోలనీలో బిగ్ బజార్ సమీపమున ఈ అశ్వధ్ధ వృక్ష బాలగణపతి అలయంవుంది
🌸అశ్వధ్ధ వృక్షాల క్రింద వినాయకుడు దర్శనమిస్తూనే వుంటాడు.
కాని ఈ ఆలయంలో అశ్వధ్ధ వృక్షమే 22 గణపతి రూపాలతో దర్శనం ఇవ్వడమనే అద్భుతం చూపరులకు విస్మయాన్ని కలిగిస్తుంది
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿© director.gopikiran
భగవద్గీత లో శ్రీకృష్ణుడు
వృక్షాలలో అశ్వథ్థ వృక్షాన్ని నేను అని అంటాడు.
🌿అశ్వథ్థవృక్ష
మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగాన
శ్రీమహావిష్ణువు,
వృక్షాగ్రాన మహేశ్వరుడు అనుగ్రహదర్శనమిస్తున్నారని పురాణాలు వివరిస్తున్నాయి.
అందువలననే అశ్వథ్థ వృక్షాన్ని
వృక్షరాజుగా పిలుస్తారు.
ఇంతటి మహిమాన్వితమైన
అశ్వధ్ధవృక్షంలో స్వయంభూగా కష్టాలను, సమస్యలను వ్రేళ్ళతో దునిమే గణపతిగా అవతరించాడు.
🌿ప్రధమంగా నర్తన గణపతి గా అవతరించి , పిదప
అదే వృక్షం లో 22 చోట్ల స్వయంభూగా దర్శనమిస్తున్నాడు.
🌸'ఓం' అనే ప్రణవమంత్రంలోని
అ, ఉ, మ కారాలలో ఉ కారంలో వున్నది శ్రీ మహా విష్ణువు.
🌿 మహావిష్ణువు స్తోత్రాలలో "శుక్లాంబరధరం ,విష్ణుం
శశి వర్ణం, చతుర్భుజం ,
ప్రసన్నవదనం ధ్యాయేత్ , సర్వ విఘ్నోప శాంతయే' అని లోకాలని కాపాడే శ్రీమన్నారాయణుడే విఘ్నాలను తొలగించే
వినాయకునిగా అవతరించినట్లుగా తెలియచేయబడినది.
🌸అందువలన, యీ అశ్వధ్ధవృక్షంలో
శ్రీ మహావిష్ణువు వున్న ప్రదేశంలో
వినాయకుడు అవతరించాడు.
🌿1983 వ సంవత్సరము జనవరి 26 తేదీన చెన్నై సాలిగ్రామంలో ఒక చిన్న కుటీరంలో యీ బాల వినాయకుని ఆలయం నిర్మించబడినది.
🌸వినాయకుని లీలలతోను
మహిమలతోను , క్రమ క్రమంగా యీ ఆలయం అభివృద్ధి చెందినది.
🌿దక్షిణ దేశంలోనే మొట్ట మొదటగా 1987 లో యీ బాల వినాయకునికి ఏక దిన లక్షార్చన పూజ అత్యంత కోలాహలంగా జరిగింది.
🌸ఆ సాయంకాలం ఘనంగా డోలోత్సవం కూడా జరిగింది. 19..10..2000 సంవత్సరములో
రాజ గోపురం కట్టి, ఆవరణ దేవతలను ప్రతిష్టించడం జరిగింది.
🌿2004 సంవత్సరంలో గణపతి
యొక్క వివిధ రూపాలను సీమ సున్నంతో తయారు చేయదల్చారు. కానీ , ఆ సంకల్పానికి అనేక
అడ్డంకులు వచ్చాయి.
🌸ఆ సమయంలోనే ఆలయానికి దక్షిణ పడమటి దిశగా వున్న అశ్వధ్ధవృక్షం మధ్య భాగం పగులు వచ్చి బీటలు పడి కిరీటంగా,ఏనుగు ముఖంగా, దంతంగా, తొండముగాను, కర్ణములుగాను, ఒక కాలు మడచి నర్తించే నర్తన గణపతి ప్రధమంగా స్వయంభూగా వెలిశాడు.
🌿వృక్షానికి వెనుక భాగమున
పంచముఖ హేరంబ గణపతి , ఉచ్ఛిష్ట గణపతి అని ఒక్కొక్క రూపంగా
స్వయంభూలుగా ఉధ్భవించసాగాయి.
🌸ఇప్పటివరకు 22 వినాయక మూర్తులు వెలిసాయి. వినాయకుడు
అనుగ్రహ ప్రసాదిగా
కీర్తించబడుతున్నాడు.
🌿ఈ వినాయకునికి ఆరు వారాలు వరుసగా ఆరు నిమ్మ పళ్ళు సమర్పించి
ప్రదక్షిణలు చేస్తే నెరవేరని కోరికేదీ వుండదని భక్తుల ధృఢ విశ్వాసం.
🌸మామిడి కాయ మొదట్లో చాలా పుల్లగా వున్న పక్వానికి వచ్చి పండగానే చాలా తీయగా వుంటుంది.
కాని నిమ్మకాయ మాత్రం ఎప్పుడూ తన పుల్లదనాన్ని కోల్పోదు.
🌿ఆవిధంగానే భగవంతునికి
భక్తుల యందు గల కరుణ , ప్రేమ ఎప్పటికీ మారదు అని నిమ్మకాయను సమర్పించడం ద్వారా స్వామి మనకు
తెలియజేస్తున్నాడు.
🌸ఆదివారాలలో
రాహుకాల సమయంలో ,
ఈ వినాయకునికి ప్రత్యేక అలంకారాలు చేసి, ఓంకార, గకార మూలమంత్ర త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా జరుగుతాయి.
🌿ప్రపంచంలో యీ వినాయకునికి పలు ప్రాంతాలలో భక్తులు వున్నారు. మూడంతస్తుల రాజగోపురం దాటగానే బాలవినాయకుని దర్శిస్తాము.
🌸ఆలయ ఆవరణలో దక్షిణా మూర్తి , లక్ష్మీ నారాయణమూర్తి , దుర్గాదేవి మొ. అనుగ్రహ దేవతల దర్శనం లభిస్తుంది.
🌿ప్రాకారము వద్ద
కాంచీ మహాస్వామి విగ్రహం సీమ సున్నంతో తయారు చేసినది వున్నది. ప్రతి గురువారం మహా మేరువుకి, చంద్రమౌళీశ్వరస్వామికి త్రిశతి అర్చనలు, అభిషేకాలు
జరుగుతాయి.
🌸దాని ప్రక్క మయూర వాహనుడు, చక్ర వ్యూహ మండపంలో వళ్ళీ , దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి,
అశ్వగణపతి , దుర్గాంబిక, మూషిక వాహన గణపతి
మొదలైన ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
🌿ఈ విగ్రహాల ప్రక్కన వున్న అద్దాల ద్వారా స్వామి శతాధిక మూర్తులుగా
వలయాకారంలో గోచరించి భక్తులను పరవశింపజేస్తారు.
🌸సంవత్సరానికి ఒక సారి
ప్రధమంగా ఆవిర్భవించిన నర్తన గణపతికి నవంబర్ 29 వ తేదీన ప్రత్యేక పూజలు జరుపుతారు.
🌿తరువాత హనుమంతుని సన్నిధి. ఇక్కడ హనుమజ్జయంతి,
శ్రీ రామనవమి సమయాలలో , యీ సన్నిధిలో ఒకే రోజు లో
ఒక లక్ష సార్లు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది.
🌸తరువాత అశ్వధ్ధ వృక్ష వినాయకుని క్రింద సర్ప విగ్రహాలు ప్రతిష్టించబడినవి. అశ్వథ్థ వృక్షానికి సమీపాన సప్తమాతృకల
చిత్రపటాలు దర్శన మిస్తాయి.
🌿ప్రతి శుక్రవారం
రాహుకాలంలో ఈ ఆలయంలో కన్యా దోష నివృత్తి పూజలు ప్రత్యేకంగా జరుపుతారు. ఆలయంలో నిత్యం చతుర్వేద పారాయణం జరుగుతుంది.
🌸 కంద షష్టి ఉత్సవం , ఉత్తరఫల్గుణి ఉత్సవ రోజుల్లో స్కందుని కి కళ్యాణం జరుపుతారు.
🌿దుర్గాదేవి కి నవరాత్రి పూజలు కోలాహలంగా చేస్తారు. జనవరి 18వ తేదీ నుండి 26 వ తేదీ వరకు వసంతోత్సవం వైభవంగా జరుపుతారు.
ఆ సమయంలో అన్ని హోమాలు చేస్తారు.
🌸జనవరి 26 వ తేదీన గణపతి రధాయాత్ర ఉత్సవం, ఏనుగు, అశ్వం, గరగలు, మయూర నాట్యాలు, ఒయిలాట్టాలతో వైభవంగా జరుపుతారు.
🌿ప్రతి పౌర్ణమినాడు మధ్యాహ్నము అన్నదానం జరుగుతుంది.
చెన్నై సాలిగ్రామం భరణి కోలనీలో బిగ్ బజార్ సమీపమున ఈ అశ్వధ్ధ వృక్ష బాలగణపతి అలయంవుంది
🌸అశ్వధ్ధ వృక్షాల క్రింద వినాయకుడు దర్శనమిస్తూనే వుంటాడు.
కాని ఈ ఆలయంలో అశ్వధ్ధ వృక్షమే 22 గణపతి రూపాలతో దర్శనం ఇవ్వడమనే అద్భుతం చూపరులకు విస్మయాన్ని కలిగిస్తుంది
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿© director.gopikiran
Related Stories